అక్షరటుడే, వెబ్డెస్క్ : QNet Fraud Raids | మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్పై సీసీఎస్ పోలీసుల (CCS Police) దాడులు చేశారు. తెలంగాణ (Telangana)తో పాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో సోదాలు చేపట్టారు.
రాష్ట్రంలో అనేక మల్టీ లెవల్ సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయి. అందులో జాయిన్ అయి ఇతరులను చేర్పిస్తే డబ్బులు వస్తాయని నమ్మిస్తున్నాయి. అంతేగాకుండా తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని చెబుతున్నాయి. తక్కువ ధరకు దొరికే వస్తువులను అధిక ధరకు అమ్ముతున్నాయి. డబ్బులు వస్తాయని నమ్మిస్తుండటంతో అనేక మంది వీటిల్లో చేరుతున్నారు. తర్వాత మోసపోయామని తెలుసుకొని బాధ పడుతున్నారు. అయితే చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. కొంత మంది మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
QNet Fraud Raids | ఫిర్యాదులు రావడంతో..
క్యూనెట్ మోసాలపై ఇటీవల ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం ఉదయం 6 గంటలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)తోపాటు కర్ణాటకలోని ఆ సంస్థ ఆఫీసుల్లో సోదాలు చేపట్టారు. హైదరాబాద్లో ఆరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 25 బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. 20 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. క్యూనెట్ సంస్థ మల్టీ లెవెల్ మార్కెటింగ్ (Multi-Level Marketing) పేరుతో రూ.వందల కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. క్యూనెట్తో పాటు అనేక సంస్థలు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయి. ఫిర్యాదులు వస్తేనే పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: Parent Care Salary Cut | తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత

