అక్షర టుడే, ఆర్మూర్: Quality Education for Students | విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి అన్నారు. ఆలూర్ మండల (Alur Mandal) కేంద్రంలోని మైనారిటీ పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశాలతో ఆమె తహశీల్దార్ రమేష్, ఎంపీడీవో గంగాధర్, ఎంఈవో నరేందర్తో కలిసి శుక్రవారం పాఠశాలను పరిశీలించారు.
Quality Education for Students | భోజనం పరిశీలన..
పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని, వంటశాలను పరిశీలించి ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అధికారులతో స్పెషల్ ఆఫీసర్ చర్చించారు. భోజనం రుచి, నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి అందిస్తున్న సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి (Special Officer Vijayalakshmi) మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సక్రమంగా వినియోగించుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నారు.
Quality Education for Students | పాఠశాలలో పరిశుభ్రత..
పాఠశాలలో పరిశుభ్రత, పోషకాహారం, హాజరు శాతం పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. తర్వాత ఎంపీడీవో గంగాధర్ (MPDO Gangadhar) మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి కోసం అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు మండల స్థాయిలో చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తహశీల్దార్ రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పారదర్శకంగా, సమర్థవంతంగా అమలయ్యేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు. ఎంఈవో నరేందర్ (MEO Narendra) మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని, బోధనలో నాణ్యత పెంపు, శాతం వృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నరేష్, ఆలూర్ సర్పంచ్ ముక్కెర విజయ్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Urban Development | నియోజకవర్గ అభివృద్ధిపై పురోగతి సాధించాలి: ఎమ్మెల్యే ధన్పాల్

