అక్షరటుడే, వెబ్డెస్క్ : Ram Navami in Vemulawada | రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లా వేములవాడలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శైవ క్షేత్రం అయిన వేములవాడలో యేటా శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ.
రాజన్న సన్నిధిలో శ్రీరామ నవమి సందర్భంగా హిజ్రాలు, ట్రాన్స్ జెండర్స్, జోగినిలు పరమశివునిని నాధునిగా భావించి వివాహం చేసుకుంటారు. ప్రస్తుతం రాజన్న ఆలయం పునరుద్ధరణ పనులు సాగుతుండటంతో భీమేశ్వర ఆలయం (Bhimeshwara Temple)లో రామ నవమి నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున హిజ్రాలు, జోగినులు హాజరు అయ్యారు. ఒకరి మెడలో ఒకరు తాళి కట్టి వివాహం చేసుకున్నారు. రాములోరి కల్యాణం జరుగుతున్న సమయంలోనే పరమశివుని మదిలో తలుచుకుని హిజ్రాలు వివాహం చేసుకున్నారు.
Ram Navami in Vemulawada | మంత్రి పొన్నం పూజలు
శ్రీరామ నవమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. భీమేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి వేద ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Ram Navami in Vemulawada | భక్తుల రద్దీ
శ్రీరామ నవమికి సాధారణం రామాలయాలు, వైష్ణవ క్షేత్రాలకు భక్తులు తరలి వస్తారు. అయితే శైవ క్షేత్రం అయిన వేములవాడకు సైతం భారీగా భక్తులు తరలి వచ్చారు. శివుడు కొలువైన వేములవాడ ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రితో పాటు శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. దీంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.

వేములవాడ
శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి భీమేశ్వరాలయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొవడం జరిగింది pic.twitter.com/2FEATwHZM3
— Ponnam Prabhakar (@Ponnam_INC) March 27, 2026
దీనిని కూడా చదవండి : CSR policy Telangana | సీఎస్ఆర్ నిధులపై పాలసీ రూపొందించాలి : సీఎం రేవంత్రెడ్డి

