అక్షరటుడే, వెబ్డెస్క్ : Ranganayaka Sagar | సిద్దిపేట (Siddipet) జిల్లా రంగనాయక సాగర్లోకి ప్రభుత్వం ఎత్తిపోతలను ప్రారంభించింది. యాసంగి సీజన్లో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రంగనాయక సాగర్లోకి నీటిని ఎత్తిపోయాలని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) ప్రభుత్వాన్ని కోరారు.
హరీష్ రావు చొరవతో యాసంగి సీజన్లో రైతులకు ఇబ్బందులు తీరాయి. యాసంగి పంట పూర్తి అయ్యేంత వరకు నీటి విడుదల చేయాలని ఇటీవల మంత్రి ఉత్తమ్కు హరీష్ రావు లేఖ రాశారు. జలాశయంలో ఒక టీఎంసీ మాత్రమే ఉన్నాయని, మరో టీఎంసీ అయితే.. పంటలకు సరిపోతాయని పేర్కొన్నారు. దీంతో నీటిని విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు.
Ranganayaka Sagar | రైతుల హర్షం
మంత్రి ఆదేశాలతో అధికారులు ఆదివారం నీటి పంపింగ్ను ప్రారంభించారు. ఒక పంపు ద్వారా నీటిని తరలిస్తున్నారు. దీంతో యాసంగి పంటలకు ఢోకా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు.
Ranganayaka Sagar | జగ్జీవన్రామ్కు నివాళి
భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హరీశ్రావు నివాళులు అర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఆయన ఆశయ సాధనలో భాగస్వాములం కావాలని సూచించారు.
రంగనాయక సాగర్ లోకి నీటి పంపింగ్ ప్రారంభం అయింది @BRSHarish గారి కృషి ఫలించింది.
• హరీష్ రావు గారి చొరవతో యాసంగి రైతులకు తీరిన ఇబ్బంది.
• యాసంగి పంట పూర్తి అయ్యేంత వరకు నీటి విడుదల చేయాలని ఇటీవల మంత్రి ఉత్తమ్ కు హరీష్ రావు గారి లేఖ
• రంగనాయక సాగర్ లో 1 టి ఎం సి మాత్రమే… pic.twitter.com/sbgG4YrHlE
— Harish Rao Updates (@HarishRaoupdts) April 5, 2026
దీనిని కూడా చదవండి : Gajwel Political Tension | గజ్వేల్లో హైటెన్షన్ .. సీఎం ఫొటో తొలగించిన బీఆర్ఎస్ నాయకులు
