అక్షరటుడే, వెబ్డెస్క్ : Ranikhet Disease | కోళ్లకు కొక్కెర వ్యాధి వ్యాపిస్తోంది. దీంతో వేల సంఖ్యల్లో కోళ్లు చనిపోతున్నాయని పౌల్ట్రీ రైతులు (Poultry Farmers) ఆందోళన చెందుతున్నారు. ఉన్నటుండి కళ్లముందే కోళ్లు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలో ‘కొక్కెర వ్యాధి’ (Ranikhet Disease) వేగంగా విస్తరిస్తోంది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు ఈ వ్యాధి సోకగానే.. గంటల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి (Mirudoddi) మండలం అందె గ్రామంలోని ఒక కోళ్ల ఫామ్లో ఏకంగా 8 వేల కోళ్లు చనిపోయాయి. మెదక్ జిల్లాలోని తూప్రాన్, కౌడిపల్లి, మనోహరాబాద్, వెల్దుర్తి, పాపన్నపేట మండలాల్లో సైతం ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఇప్పటి వరకు సుమారు 80 వేలకు పైగా కోళ్లు చనిపోయాయి. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
Ranikhet Disease | గాలి ద్వారా వ్యాప్తి
కొక్కెర వ్యాధి గాలి ద్వారా వ్యాపిస్తోంది. వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుండటంతో కోళ్లఫామ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఈ వ్యాధి విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో మొదట బర్డ్ ఫ్లూగా అనుమానించారు. అయితే అధికారులు మాత్రం కొక్కెర వ్యాధి అని చెప్పారు. ఈ వ్యాధి పారమిక్సో తరగతి వైరస్తో వస్తుంది. ఇది బాయిలర్తో పాటు నాటు కోళ్లలో కూడా వస్తుంది. వ్యాధి సోకిన కోళ్లు ఆకుపచ్చ రంగులో నీళ్ల విరేచనాలు చేసుకుంటాయి. కళ్లు, ముక్కు నుంచి నీళ్లు కారుతాయి. ఆహారం, నీరు తీసుకోవు. దీంతో బలహీనంగా మారి వెంటనే చనిపోతాయి. అధికారులు స్పందించి కోళ్లు మృతి చెందకుండా మందులు అందించాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు.
దీనిని కూడా చదవండి : Hyderabad Rotten Chicken | కుళ్లిన చికెన్.. బార్లు, వైన్ షాపులకు సప్లై

