అక్షరటుడే,ఆర్మూర్ : Red Sorghum Farmers | ఆర్మూర్ ప్రాంతంలోని ఎర్రజొన్న రైతులకు అన్యాయం జరుగుతోందని రైతు, వ్యాపారి యామాద్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రెస్క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశoలో ఆయన మాట్లాడారు. తక్కువ ధరకు ఎర్రజొన్నలను అమ్మవద్దని.. నిల్వ ఉంచుకోవాలని రైతులకు సూచించారు.
Red Sorghum Farmers | 38 ఏళ్లుగా రైతులతో అనుబంధం..
ఆర్మూర్ (Armoor) ప్రాంతంలో 38ఏళ్లుగా ఎర్రజొన్న పంటను బైబ్యాక్ ఒప్పందం ద్వారా మూలవిత్తనాన్ని అందజేస్తూ కొనుగోలు చేస్తూ వచ్చారన్నారు. 15 ఏళ్లుగా బైబ్యాక్ ఒప్పందాలను తుంగలో తొక్కి అధికారుల అండదండతో విత్తన వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం కూడా విత్తన కమిటీలు సిండికేట్గా మారాయని తనకు సైతం ఫోన్ చేయగా తాను సిండికేట్ (Syndicate)లో చేరేది లేదని స్పష్టంగా చెప్పేశానన్నారు. గతంలో సైతం సిండికేట్లో చేరాలని తనపై కేసులు చేయించారన్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే ఒకరు కీలకపాత్ర పోషించారని ఆరోపించారు.

Red Sorghum Farmers | ఎర్రజొన్నల ధర తగ్గడానికి వారే కారణం..
ఎర్రజొన్నల ధర తగ్గడానికి మాజీఎమ్మెల్యే గ్రూపే కారణమని యామాద్రి భాస్కర్ అన్నారు. తాను సైతం కమ్మర్పల్లి (Kammarpally)లో బైబ్యాక్ ఒప్పందం మేరకు రూ.39కు మూల విత్తనాన్ని అందజేశానని ఇప్పుడు సైతం అదే ధరకు ఎర్రజొన్నలను కొనుగోలు చేస్తానన్నారు. గతంలో సైతం తనపై కక్షగట్టి తన రెండు కార్లు, గోదాంను సీజ్ చేస్తే హైకోర్టు (High Court)లో రిట్ వేసి గెలిచానన్నారు.
Red Sorghum Farmers | తక్కువకు అమ్ముకోవద్దు..
ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై అధికార పార్టీ నాయకులు రైతులకు అండగా నిలవాలన్నారు. రైతులకు ఇంతగా ఇబ్బంది కలుగుతుంటే రైతు నాయకులు ఎక్కడికి పోయారని ఆయన ప్రశ్నించారు. యుద్ధం కారణం చూపుతూ రూ.40 ఉన్న ధరను రూ.33 చేశారని ఎర్రజొన్నలు 80శాతం భారతదేశంలోనే అమ్ముడవు తాయని ఆయన తెలిపారు. ఆర్మూర్ ప్రాంత రైతులు తొందరపడి ఎర్రజొన్నలను తక్కువ ధరకు అమ్ముకోవద్దని, నిల్వ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Student Assault | శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్.. కేసు నమోదు

