అక్షరటుడే, వెబ్డెస్క్ : Retired Employees Benefits | రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి రిటైర్మెంట్ ప్రయోజనాలు వెంటనే అందించాలన్నారు.
తమ సమస్యలపై పలువురు విశ్రాంత ఉద్యోగులు గురువారం హరీశ్రావును కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా సేవలందించిన వారి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదన్నారు. రిటైర్డ్ అయ్యాక బెన్ఫిట్స్ ఇవ్వకుండా కర్కశంగా వ్యవహరిస్తుండటం దుర్మార్గం అని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో బెన్ఫిట్స్, పెన్షన్ బకాయిలు రాక మనోవేదనకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Retired Employees Benefits | అండగా ఉంటాం
హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు (Retired Employees) కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని హరీశ్రావు అన్నారు. బకాయిలు చెల్లించే వరకు ప్రభుత్వాన్ని వదిలి పెట్టబోమని హెచ్చరించారు. రిటైర్డ్ ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా అంటుందని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా ఈ సమస్యను లేవనెత్తుతామని తెలిపారు. మూసీ సుందరీకరణకు రూ.లక్షన్నర కోట్లు, ఫ్యూచర్ సిటీ కోసం రూ.లక్ష కోట్లు, అందాల పోటీల కోసం వందల కోట్లు, ఫుట్బాల్ మ్యాచ్కు 100 కోట్లు ఇచ్చే రేవంత్ రెడ్డి.. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించక పోవడం దారుణమన్నారు.
Retired Employees Benefits | కమీషన్లు రావనే..
కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత 98 వేల కోట్లకు టెండర్లు పిలిచారని హరీశ్రావు పేర్కొన్నారు. బడా కాంట్రాక్టర్లకు 40 వేల కోట్లు చెల్లించారని, ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, బెనిఫిట్స్ కోసం మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కమీషన్లు రావు కాబట్టి వీరికి బకాయిలు చెల్లించడం లేదన్నారు.
ఇది కూడా చదవండి..: Kavitha CBI Notice | కవిత ఇంటికి సీబీఐ అధికారులు

