అక్షరటుడే, వెబ్డెస్క్ : Rice Export Scam | ఫిలిప్పీన్స్ (Philippines)కు బియ్యం ఎగుమతుల్లో పెద్ద స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) ఆరోపించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.
సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న ప్రేమ్ చంద్ గార్గ్ అనే వ్యక్తిని బియ్యం ఎగుమతులకు అడ్వైజర్గా పెట్టుకున్నారని హరీశ్రావు అన్నారు. ఈ అడ్వైజర్ ఇచ్చిన సలహాతో రాష్ట్రానికి నష్టం జరిగింది నిజం కాదా అని ప్రశ్నించారు. పది లక్షల మెట్రిక్ టన్నులు ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేస్తాం అని ఎంవోయూ చేసుకున్నాం అని, ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అని, మా విజయం అని గొప్పలు చెప్పుకున్నారన్నారు.ఇప్పుడు ఇదే పెద్ద స్కాంగా మారిందని ఆరోపించారు.
Rice Export Scam | పురుగు పడుతోంది
పది లక్షల టన్నుల ఎగుమతికి ఎంవోయూ చేసుకొని, 22,750 టన్నులు మాత్రమే ఎందుకు ఎగుమతి చేశారన్నారు. మరో 7,500 టన్నులు ఏడాది నుంచి కాకినాడ పోర్టులో పురుగులు పడి ముక్కిపోయాయన్నారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న మీ అడ్వైజర్ ఎక్కడికి పోయిండని ఆయన ప్రశ్నించారు. ఈ సివిల్ సప్లైలో జరిగిన అన్ని కుంభకోణాలపై హౌస్ కమిటీ (House Committee) వేయాలని డిమాండ్ చేశారు.
Rice Export Scam | ఆధారాలతో సహా నిరూపిస్తాం
రాష్ట్రంలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని హరీశ్రావు అన్నారు. తాము వచ్చాక ఈ కుంభకోణాలపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కంటే రికార్డు స్థాయిలో వరి సేకరించామని చెబుతోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కానీ ఎప్పుడు కూడా గతంలో కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు.
ఇది కూడా చదవండి..: QNet Fraud Raids | ఎంఎల్ఎం సంస్థ క్యూనెట్పై సీసీఎస్ దాడులు

