అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Road Safety Rules | వాహనాదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. రుద్రూర్ పోలీస్ స్టేషన్ (Rudrur Police Station) పరిధిలోని జేఎంసీ కాలనీ (JMC Colony) వద్ద మంగళవారం ఉదయం లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈ ప్రమాద స్థలాన్ని సీపీ పర్యవేక్షించారు.
Road Safety Rules | బోధన్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న..
బోధన్ నుంయి హైదరాబాద్ (Bodhan to Hyderabad) వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీ రెండు ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 18 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్లో బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు.
Road Safety Rules | ప్రమాదాలు జరగకుండా..
రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రోడ్ స్టాపర్లు, రోడ్డు డివైడర్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ను నియంత్రించి వాహనాలను జేసీబీ సాయంతో పక్కకు తరలించారు. బాధితులకు బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. మెరుగైన వైద్యసేవల కోసం క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి (Nizamabad Government Hospital) తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్బాబు, రుద్రూర్ ఎస్సై సాయన్న, సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, ఆర్టీసీ, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Bodhan Government Hospital | బోధన్ ఆస్పత్రిలో సదుపాయల మెరుగుదలకు కృషి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

