అక్షరటుడే, హైదరాబాద్: Rohith Reddy Remand | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి Pilot Rohith Reddyని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Rohith Reddy Remand | ఫామ్హౌస్ పార్టీలో డ్రగ్స్ ఆరోపణలు
మొయినాబాద్ మండలం అజీజ్నగర్లో ఉన్న ఫామ్హౌస్లో శనివారం డ్రగ్స్, మద్యం పార్టీ జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు గుర్తించారు. దాడి సమయంలో కొంతమంది అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
Rohith Reddy Remand | కాల్పుల కలకలం
పోలీసులు అక్కడికి చేరుకున్న సమయంలో గాల్లోకి కాల్పులు జరపడం సంచలనంగా మారింది. కాల్పుల వల్ల ఎవరూ గాయపడకపోయినా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి, అక్కడ ఉన్నవారిని విచారించారు.
డ్రగ్స్ పరీక్షలు
సోదాల అనంతరం.. పార్టీలో పాల్గొన్న వారందరికీ పోలీసులు డ్రగ్స్ పరీక్షలు జరిపినట్లు సమాచారం. వారిలో కొందరికి డ్రగ్స్ వినియోగించినట్లు పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Putta Mahesh | డ్రగ్స్ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్.. ఎంపీ పుట్టా వివరణ!

