అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: RP Super Speciality Hospital | పేద, మధ్యతరగతి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరం (eye checkup camp) ఏర్పాటు చేశామని ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (RP Super Speciality Hospital) అధినేత డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్ (Dr. Boddula Rajendra Prasad) పేర్కొన్నారు.
RP Super Speciality Hospital | కోటగల్లీలోని పద్మశాలి తర్ప భవనంలో..
నగరంలోని (Nizamabad City) కోటగల్లీలో పద్మశాలి సంఘం తర్ప నం.3 ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని(charitable health camp) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ వనిత రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. అనంతరం డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యంగా కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
RP Super Speciality Hospital | కంటి సమస్యలపై నిర్లక్ష్యం వద్దు..
అనంతరం కంటివైద్య నిపుణురాలు డాక్టర్ వనిత మాట్లాడుతూ కంటి ఆరోగ్యం మన దైనందిక జీవితంలో అత్యంత ముఖ్యమన్నారు. సమయానికి పరీక్షలు చేయించుకుంటే అనేక కంటి సమస్యలు ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందవచ్చని ఆమె సూచించారు. ఈ కంటి వైద్యశిబిరం (medical camp india) ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించగా కాలనీలోని అనేకమంది చికిత్సలు చేయించుకున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కాలనీవాసులు కోరారు.
RP Super Speciality Hospital | ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
నగరంలోని (Nizamabad City) ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో హాస్పిటల్ ఛైర్మన్ బొద్దుల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యులు, మహిళా సిబ్బంది, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. మహిళల సేవలను, సమాజ నిర్మాణంలో వారి పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా ప్రధాన శక్తిగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యం, విద్య, సేవా రంగాల్లో విశేషమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. డాక్టర్ వనిత మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరమన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు ఆరోగ్యాన్ని కూడా మహిళలు కాపాడుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy EV Plan | డీజిల్ బస్సులను తొలగిస్తాం.. త్వరలో విద్యార్థినులకు స్కూటీలు : సీఎం రేవంత్రెడ్డి

