అక్షరటుడే, వెబ్డెస్క్ : RTC Bus Discount | హైదరాబాద్ (Hyderabad) నగర ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. నగర పరిధిలో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30 శాతం రాయితీ అమలు చేస్తున్నట్లు తెలిపింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాలో అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో పెట్రోల్, డీజిల్ దొరకదని పుకార్లు వ్యాపించాయి. వాహనదారులు బుధవారం ఉదయం నుంచి పెట్రోల్ బంక్లకు పరుగులు తీశారు. ఫలితంగా అనేక బంక్ల్లో స్టాక్ అయిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు బంక్ల వద్ద బారులు తీరాయి. ఈ క్రమంలో ప్రజలకు ఆర్టీసీ (TGS RTC) శుభవార్త చెప్పింది. పెట్రోల్ కష్టాలు ఎందుకు దండగ, ఆర్టీసీ బస్సులు ఉండగా అని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు. బంకుల వద్ద పెట్రోల్ కోసం బారులు తీరొద్దని, సురక్షితంగా బస్సులో ప్రయాణించాలని ఆయన సూచించారు.
RTC Bus Discount | ఇంధనాన్ని ఆదా చేయాలి
ప్రస్తుతం చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దేశీయంగా ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. ఫలితంగా నష్టాలను ఆయా చమురు సంస్థలు భరిస్తున్నాయి. అయితే దిగుమతుల కోసం దేశం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. ఈ క్రమంలో ఇంధనం ఆదా చేయడం ఎంతో అవసరం. ఇందులో భాగంగా వ్యక్తిగత వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను వినియోగిస్తే పెట్రోలు భారం ప్రజలకు అటు ప్రభుత్వానికి తప్పనుంది. సొంత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూసే బదులు, క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులను వినియోగించాలని ఎండీ నాగిరెడ్డి (RTC MD) సూచించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతుందని తెలిపారు.
RTC Bus Discount | ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
నగరంలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో వ్యక్తిగత వాహనాలకు బదులుగా ఆర్టీసీ బస్సులను వినియోగిస్తే.. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గనుంది. దీంతో ట్రాఫిక్ తప్పలతో పాటు కాలుష్యం కూడా తగ్గనుంది. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. ఈ క్రమంలో ఏసీ బస్సుల్లో 30శాతం రాయితీ ఇవ్వడంతో టికెట్ భారీగా తగ్గనున్నాయి. దీంతో ఆ బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉంది.
దీనిని కూడా చదవండి : Chicken Shops Bandh | ఏప్రిల్1 నుంచి చికెన్ షాపులు బంద్!

