అక్షరటుడే, వెబ్డెస్క్: Russian Oil Tanker | ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో కొద్ది రోజులుగా పశ్చిమాసియలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. యూఎస్ (US) దాడులను నిరసిస్తూ ఇరాన్ (Iran) హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేసింది.
దీంతో గ్యాస్ చమురు సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా (Russia) చమురు కొనుగోలుపై విధించిన పలు ఆంక్షలను ఇటీవల అమెరికా (America) సడలించింది. సముద్ర జలాల్లో ఇప్పటికే ట్యాంకర్లలో లోడ్ అయి ఉన్న చమురును కొనుగోలు చేసేందుకు భారత్కు అవకాశం కల్పించింది. ఇందుకు 30 రోజుల వరకు గడువు ఇచ్చింది.
Russian Oil Tanker | రష్యానుంచి పెరిగిన క్రూడ్ దిగుమతులు..
రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ ఇటీవలి కాలంలో మళ్లీ పెంచింది. యూఎస్, ఇరాన్ల మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దేశ రిఫైనరీలు 30 మిలియన్ల బ్యారెళ్ల చమురును రష్యానుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. జపాన్, దక్షిణకొరియా వంటి పలు దేశాలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ చైనా సముద్ర జలాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
రష్యాకు చెందిన ఆక్వా టైటాన్ (Aqua Titan) అనే చమురు వాహక నౌక భారత్ (India) వైపు మళ్లినట్లు తెలుస్తోంది. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం జనవరి చివరిలో బాల్టిక్ సీ పోర్ట్లో ఈ ట్యాంకర్లోకి చమురు నింపారు. ఇది చైనాలోని రిజావో పోర్ట్కు వెళ్లాల్సి ఉంది. కానీ భారత్ అవసరాల దృష్ట్యా.. రష్యా మన దేశానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే చైనా కోసం వెళ్తున్న ట్యాంకర్ను మధ్యలోనే ఆపి భారత్కు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మార్చి 21 నాటికి న్యూ మంగళూరుకు చేరుకోనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్కు మోడీ ఫోన్.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!

