అక్షరటుడే, వెబ్డెస్క్: Shamshabad Airport | అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఎయిర్పోర్టుల అక్రమ రవాణాలు ఆగడం లేదు. తాజాగా.. శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా గంజాయి పట్టుబడింది.
కౌలాలంపూర్ (Kualalampur)నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేయగా.. వారి వద్ద రూ.3 కోట్ల విలువైన తొమ్మిది కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు (Customs Officers) స్వాధీనం చేసుకున్నారు. వారు తరలిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తున్నారు.

Shamshabad Airport | ముషీరాబాద్లో హాష్ ఆయిల్
మరోవైపు హైదరాబాద్ (Hyderabad)లోని ముషీరాబాద్లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జె.ఆర్.ప్రదీప్ అనే వ్యక్తి వద్ద నుంచి విజయ్ కుమార్ హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 367 గ్రాముల హాష్ ఆయిల్తో పాటు ఒక బైకు మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
₹3.18 cr worth #Ganja seized at @RGIAHyd Airport
Acting on specific intelligence, #HyderabadCustoms officials at #RGIA intercepted two #passengers arriving from #Hanoi via #KualaLumpur on @airasia flight AK069 (08.03.2026).
During inspection, officers recovered… pic.twitter.com/lXM7HtoQBd
— NewsMeter (@NewsMeter_In) March 9, 2026
ఇది కూడా చదవండి..: Bamrukn Ud Daula Lake | ప్రారంభానికి బమృకున్ – ఉద్ – దౌలా చెరువు సిద్ధం

