అక్షరటుడే, వెబ్డెస్క్ : Sherylingampally | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (Arikepudi Gandhi) ఫొటోలను డ్రెయినేజీలో పెట్టి ప్రజలు నిరసన తెలిపారు. ఈ ఘటన శేరిలింగంపల్లిలో చోటు చేసుకుంది.
Sherylingampally | పనులు జాప్యం కావడంతో..
మురికి కాలువల్లో రేవంత్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఫొటోలు పెట్టి.. పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని స్థానికుల ప్రశ్నించారు. డ్రెయినేజీ పనుల కోసం.. శేరిలింగంపల్లిలో రోడ్లు తవ్వి నెలలు గడుస్తున్నా, ఇంకా పనులు పూర్తి చేయలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే..‘‘నువ్వు పార్టీలు మారావ్, మరి మా బస్తీల పరిస్థితి మారేదెప్పుడంటూ” స్థానికులు ప్లకార్డులను డ్రెయినేజీల్లో ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మున్సిపల్ పనులు ముందుకు సాగడం లేదని నిరసన తెలిపారు. కాగా అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన అనర్హత పిటిషన్ను గతంలో స్పీకర్ కొట్టివేశారు. ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : Hyderabad Lakes Restoration | రెండు నెలల్లో చెరువుల పునరుద్ధరణ : హైడ్రా కమిషనర్
