అక్షరటుడే, వెబ్డెస్క్ : SI caught by ACB | మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఓ కేసులో సీజ్ చేసిన వాహనాలను విడుదల చేయడానికి లంచం తీసుకున్న ఎస్సైని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లా తిమ్మాజిపేట పోలీస్స్టేషన్లో హరి ప్రసాద్రెడ్డి ఎస్సైగా పని చేస్తున్నాడు. ఓ కేసులో ఆయన వాహనాలను జప్తు చేశారు. వాటిని విడుదల చేయడానికి మార్చి 5న ఎస్సై రూ.30 వేల లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో మార్చి 12న రూ.20 వేలు తీసుకున్నాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఎస్సై హరిప్రసాద్రెడ్డి (SI Hariprasad Reddy)ని అరెస్ట్ చేశారు. జప్తు చేసిన వాహనాలను విడుదల చేయడం అనే అధికారిక విధిని నిర్వర్తించినందుకు ఎస్సై లంచం తీసుకున్నాడని అధికారులు తెలిపారు. అతడిని నాంపల్లిలో ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.
SI caught by ACB | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. వస్తువులు, బహుమతుల రూపంలో అడిగినా.. తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1064, ఏసీబీ వెబ్సైట్ (ACB Website) ద్వారా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎంత మొత్తంలో లంచం అడిగినా.. ఇవ్వొద్దని సూచించారు.
దీనిని కూడా చదవండి : KTR Warning Police | ఎవరిని వదిలిపెట్టం.. పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
