అక్షరటుడే, ఆర్మూర్: Siddhartha College Farewell | పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో (Siddhartha Degree College) 2025-26 విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా థర్డ్ ఇయిర్ విద్యార్థులకు ఫేర్వెల్ డే నిర్వహించారు. స్థానిక క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది.
ముఖ్య అతిథిగా కళాశాల ఛైర్మన్ రాజారాం యాదవ్ (Rajaram Yadav) హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో కళాశాల దశ ఎంతో కీలకమైందన్నారు. ఇక్కడ నేర్చుకున్న విలువలు, జ్ఞానం జీవితాంతం తోడుంటాయని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతలపై పట్టు సాధించాలని, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలని సూచించారు.
Siddhartha College Farewell | క్రమ శిక్షణతో కూడిన చదువు..
క్రమశిక్షణతో కూడిన చదువు ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని రాజారాం యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, డైరెక్టర్ నవీన్ యాదవ్, పరిపాలన అధికారి రాకేష్, అధ్యాపకులు బాలరాజ్, అర్వింద్, రాజశేఖర్, రజనీకాంత్, ప్రమోద్, అర్చన, సుమలత, నవనీత, నిఖిత, అపూర్వ, హర్షవర్దిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Paddy Procurement Farmers | రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
