అక్షరటుడే, వెబ్డెస్క్: Siddhi Vinayaka Temple Donation | సంగారెడ్డి జిల్లా ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్ధనూర్ గ్రామంలో ఉన్న సిద్ధి వినాయక ఆలయానికి భారీ విరాళం అందింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు Kalvagadda Rajkumar రూ.50 లక్షల విరాళం అందజేశారు. ఆలయ అభివృద్ధి, సదుపాయాల విస్తరణ కోసం ఈ మొత్తాన్ని సమర్పించినట్లు రాజ్కుమార్ తెలిపారు.
Siddhi Vinayaka Temple Donation | ప్రత్యేక పూజలు
ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భారాస పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. విరాళం చెక్కును ఆలయ ట్రస్టు ప్రతినిధులకు ఈ సందర్భంగా రాజ్కుమార్ అందజేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
ఆలయ అభివృద్ధి కోసం తన వంతుగా మరింత కృషి చేస్తానని రాజ్కుమార్ పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ సహాయం అందించినట్లు వివరించారు.
Siddhi Vinayaka Temple Donation | పలు సదుపాయాలు
రాజ్కుమార్ సహాయానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విరాళంతో ఆలయంలో నిర్మాణ పనులు, మరమ్మతులు, భక్తుల కోసం అవసరమైన సదుపాయాలు కల్పించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

