అక్షరటుడే, వెబ్డెస్క్ : Single Student Exam Center | ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సిబ్బందిని సైతం నియమించారు. తీరా సదరు విద్యార్థి పరీక్ష రాయడానికి రాకపోవడం గమనార్హం.
ఇంటర్ రెగ్యులర్ పరీక్షలు శుక్రవారం ముగిసిన విషయం తెలిసిందే. అయితే బ్రిడ్జి కోర్సు పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా
నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool District)లో ఇంటర్ బ్రిడ్జ్ కోర్సు పరీక్షకు వరుణ్ సందేశ్ అనే విద్యార్థి దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల దరఖాస్తులు స్వీకరించగా.. ఒక్క విద్యార్థి మాత్రమే అప్లై చేశాడు. దీంతో అధికారులు పరీక్ష కోసం ఏర్పాట్లు చేశారు. ఐదుగురు సిబ్బందిని నియమించారు. పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.

Single Student Exam Center | ఖాళీగా సిబ్బంది
అప్లై చేసుకున్న ఒక్క విద్యార్థి కూడా పరీక్షకు డుమ్మా కొట్టాడు. దీంతో పరీక్ష కేంద్రంలో సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు. సాధారణంగా ఒక్కో పరీక్షా కేంద్రం (Examination Center)లో వందలాది మంది విద్యార్థులతో సందడి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఉన్న ఒక్క విద్యార్థి కూడా రాకపోవడం గమనార్హం. ఇంటర్ పూర్తి చేసిన వరుణ్ సందేశ్ జనరల్ బ్రిడ్జి కోర్సు (General Bridge Course) మ్యాథమేటిక్స్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కడి కోసం ప్రత్యేకంగా కేంద్రం ఏర్పాటు చేసిన సదరు విద్యార్థి మాత్రం హాజరు కాకపోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి..: LPG Supply Monitoring | ఎల్పీజీ కృత్రిమ కొరత.. సర్కారు కీలక నిర్ణయం.. ఇక పర్యవేక్షణ కట్టుదిట్టం!

