అక్షరటుడే, వెబ్డెస్క్ : Social Media Ban Kids | కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే దిశగా ఏపీ ప్రభుత్వం సైతం అడుగులు వేస్తోంది. 13 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వాడకుండా నిషేధం విధిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు.
కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా వాడకుండా నిషేధం అమలు చేసింది. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిర్ణయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సైతం అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్లలోపు ఉన్న వారికి సామాజిక మాధ్యమాలు అందుబాటులో లేకుండా చేస్తామన్నారు. 90 రోజుల్లో దీనిని అమలు చేస్తామని ప్రకటించారు.
Social Media Ban Kids | జీవితం నాశనం
సోషల్ మీడియా (Social Media) బ్యాన్ చేస్తే బాగుంటుందని తమకు సూచన వచ్చిందన్నారు. త్వరలోనే దీనిని అమలు చేస్తామని తెలిపారు. 13 నుంచి 16 ఏళ్ల వయసు వారికి సంబంధించి ఏం చేయాలనేదానిపై చర్చిస్తున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాలతో పిల్లలు నష్టపోవద్దన్నారు. అందుకోసం తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. సాంకేతికతను వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని, బానిసైతే జీవితాలు నాశనం అవుతాయని చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) సైతం మైనర్లు సోషల్ మీడియా వాడకుండా కసరత్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి..: Tirumala Forest Fire | తిరుమల కొండల్లో కార్చిచ్చు..

