అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: SSC Exam Vigilance | పరీక్షలు జరిగే సమయంలో అధికారులు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. నగరంలో ఎస్సెస్సీ పరీక్షలు జరుగుతున్న ఎస్ఎఫ్ఎస్, రవి హైస్కూల్ కేంద్రాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
SSC Exam Vigilance | జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలి..
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల చుట్టూ ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట మూడో టౌన్ పోలీస్ (3 Town Police) అధికారి నారాయణ, హెడ్మాస్టర్ ఆనంద్, సిట్టింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జి మహమ్మద్ అలీ, సీఎస్ మల్లికార్జున్, నవీన్ డిపార్ట్మెంటల్ అధికారులు తదితరులున్నారు.
ఇది కూడా చదవండి..: Police Investigation Standards | కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి: ఎస్పీ

