అక్షరటుడే, వెబ్డెస్క్: SSC Exams | రాష్ట్రంలో భవిష్యత్లో పదో తరగతి పరీక్షలు ఉండవని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వస్తామని చెప్పారు. బడ్జెట్ అనంతరం ఆయన మీడియా చిట్చాట్లో మాట్లాడారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు ఎస్ఎస్సీ బోర్డు (SSC Board) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వీటిని తొలగిస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం అమలు చేస్తామన్నారు. జాతీయ స్థాయిలో +2 విధానం అమలులో ఉందన్నారు. దీనిపై అధ్యయనం చేసిన తర్వాత తెలంగాణలో అమలు చేస్తామని తెలిపారు. ఇటీవల విద్యా కమిషన్ ఇచ్చిన నివేదిక ఫైనల్ కాదన్నారు. కాగా ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఏడో తరగతికి వార్షిక పరీక్షలు బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించేవారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం దానిని తొలగించారు. అలాగే ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు సైతం తొలగించనున్నట్లు సీఎం తెలిపారు.

SSC Exams | సంక్షేమ బడ్జెట్
తమది సంక్షేమం, అభివృద్ధి బడ్జెట్ (Telangana Budget) అని సీఎం అన్నారు. బడ్జెట్కు వ్యతిరేకంగా చెవిలో పువ్వులతో బీఆర్ఎస్ చేపట్టిన నిరసనపై ఆయన సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ నేతల వీపుపై బండలు కట్టాలన్నారు. కేసీఆర్ బయటకి రాకుండా గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)కేసులో విచారణ పూర్తి కాకుండా చర్యలు తీసుకోలేమన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు అమెరికాలో ఉండటంతో విచారణ ఆలస్యం అయిందన్నారు.
SSC Exams | మూసీపై ముందుకే..
భూముల అమ్మకానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని రేవంత్రెడ్డి చెప్పారు. భూములు అమ్మితే వచ్చిన డబ్బులను సొంతానికి వాడుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. మూసీ ప్రాజెక్ట్ విషయంలో ఆగేది లేదన్నారు. నష్టపోతున్న వారిని ఆదుకుంటామని చెప్పారు. మూసీ ప్రాజెక్ట్ విషయంలో గాంధీ మనుమడు బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డారని సీఎం అన్నారు.
SSC Exams | పీసీసీ చీఫ్ చూసుకుంటారు
రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై పెద్ద చర్చ జరుగుతుంటే బీజేపీ ఎందుకు స్పందించడం లేదని సీఎం ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు కలిసి ఉన్నాయని అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ వాళ్లని తిడితే బీజేపీ ఎందుకు మాట్లాడుతోందన్నారు. మాజీ మంత్రి జీవన్రెడ్డి అంశాన్ని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ చూసుకుంటారని తెలిపారు. కాగా జీవన్రెడ్డి పార్టీ మారతానని ప్రకటించిన విషయం తెలిసిందే.
దీనిని కూడా చదవండి : Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

