అక్షరటుడే, కామారెడ్డి: SSC Exams | జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పరీక్షల్లో భాగంగా శనివారం గణిత శాస్త్రం పరీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 13,154 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 13,122 హాజరయ్యారు. 32 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
SSC Exams | ఎస్పీ రాజేష్ చంద్ర ఆరా..
కామారెడ్డి (Kamareddy) పట్టణంలో జరుగుతున్న పరీక్షల తీరును ఎస్పీ రాజేశ్ చంద్ర (SP Rajesh Chandra) పరిశీలించారు. పట్టణంలోని బాయ్స్ హైస్కూల్, జీవధాన్ పాఠశాలల పరీక్షా కేంద్రాలను (Examination Centers) పరిశీలించి భద్రతా చర్యలపై ఆరా తీశారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 బీఎన్ఎస్ సెక్షన్ ఖచ్చితంగా అమల్లో ఉండేలా చూడాలని, అనవసరంగా గుమిగూడే వ్యక్తులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రతి కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత కొనసాగించాలని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Kavitha Party Name Controversy | కవిత వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ప్రజాప్రతినిధుల ఆగ్రహం..

