అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: SSC Exams Nizamabad | జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు.
SSC Exams Nizamabad | జిల్లా కేంద్రంలో, ఆర్మూర్లో..
జిల్లా కేంద్రంలోని బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్ (Blooming Birds School), ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను, సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు. విద్యార్థుల హాజరుశాతం, బందోబస్తు, తాగునీరు, ప్రథమ చికిత్స వసతి వంటి వాటిని పరిశీలించారు.
SSC Exams Nizamabad | పరీక్ష కేంద్రం నిర్వహణపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం..
బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్లో పరీక్షల నిర్వహణలో పలు లోపాలను గుర్తించిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు ఆస్కారం కల్పిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్కు షోకాజ్ నోటీసు (Show-cause Notice) ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. తక్షణమే బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్ను సందర్శించి నిర్వహణాపరమైన లోపాలను చక్కదిద్దాలని సూచించారు. విద్యార్థులు దగ్గర దగ్గరగా కూర్చుండి పరీక్షలు రాస్తున్నారని, మరో ఐదు అదనపు గదులను పరీక్షల నిర్వహణ కోసం వినియోగించాలని, సీటింగ్ అరేంజ్మెంట్స్ పక్కాగా ఉండాలన్నారు.
పరీక్షా కేంద్రాల్లోకి (examination centers) సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదన్నారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలన్నారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు అధికారులు సమన్వయంతో పని చేస్తూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు సత్యకుమారి, ఎస్.వెంకట్రామ్ రెడ్డి ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Municipal Controversy | బల్దియా కమిషనర్, టీపీవోలను సరెండర్ చేయాల్సిందే..: కౌన్సిలర్ల ఏకగ్రీవ తీర్మానం

