అక్షరటుడే, వెబ్డెస్క్ : Stock Market Gains | అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదరడంతో స్టాక్ మార్కెట్లు (Stock Market) పుంజుకున్నాయి. ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ తో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర తగ్గడం, డాలర్ విలువ క్షీణించడం, రూపాయి బలపడడం, ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచకుండా యథాతథంగా కొనసాగించడం వంటి కారణాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దలాల్ స్ట్రీట్లో బుల్స్ రంకెలు వేయడంతో సెన్సెక్స్, నిఫ్టీలు 4 శాతానికిపైగా లాభపడ్డాయి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత వరుసగా ఐదు సెషన్లపాటు మన మార్కెట్లు లాభాలతో ముగియడం ఇదే మొదటిసారి.
Stock Market Gains | భారీ లాభాలతో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 2,674 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో కాస్త దిద్దుబాటుకు గురై 250 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి పుంజుకుని 593 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ 732 పాయింట్ల లాభంతో ప్రారంభమై 27 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 197 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 2,946 పాయింట్ల లాభంతో 77,562 వద్ద, నిఫ్టీ 873 పాయింట్ల లాభంతో 23,997 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Gains | అన్ని సూచీలు లాభాల్లోనే..
దేశీయ స్టాక్ మార్కెట్లోని అన్ని ఇండెక్స్లు లాభాల్లో సాగుతున్నాయి. నిఫ్టీలో రియాలిటీ ఇండెక్స్ 6.75 శాతం, ఆటో ఇండెక్స్ 6.69 శాతం, బ్యాంక్ నిఫ్టీ 5.67 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 5.48 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 5.15 శాతం పెరిగాయి.
Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 3,859 కంపెనీలు లాభపడగా 537 స్టాక్స్ నష్టపోయాయి. 101 కంపెనీలు ఫ్లాట్గా ముగిశాయి. 99 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 28 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 16.80 లక్షల కోట్ల మేర పెరిగింది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్లో 20 కంపెనీలు లాభాలతో, 10 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇండిగో 8.22 శాతం, ఎల్టీ 7.64 శాతం, బజాజ్ ఫైనాన్స్ 7.03 శాతం, ఎంఅండ్ ఎం 6.79 శాతం, యాక్సిస్ బ్యాంక్ 6.56 శాతం లాభపడ్డాయి.
Losers : టెక్ మహీంద్రా 1.53 శాతం, సన్ఫార్మా 0.29 శాతం, పవర్గ్రిడ్ 0.20 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Crude Oil Prices Drop | సీజ్ ఫైర్ ప్రకటన.. భారీగా పడిపోయిన చమురు ధరలు
