అక్షరటుడే, వెబ్డెస్క్ : Stock Market Loss | పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించింది. ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియక మదుపరులు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్కు మద్దతుగా హూతీ గ్రూప్ (Houthi Group) రంగంలోకి దిగడం, ముడి చమురు ధరలు పెరుగుతూ ఉండడంతో సూచీలు భారీగా నష్టపోయాయి.
Stock Market Loss | రోజంతా నష్టాల్లోనే..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బేర్స్ దెబ్బకు విలవిల్లాడుతూ తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. సోమవారం రోజంతా నష్టాల్లోనే ఉంది. ఉదయం సెన్సెక్స్ 1,018 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 174 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి 774 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 270 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 79 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి 244 పాయింట్లు పైకి ఎగబాకింది. అయితే గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్తో సూచీలు మళ్లీ భారీగా పతనమయ్యాయి. ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్ 1,391 పాయింట్లు, నిఫ్టీ 431 పాయింట్లు పడిపోయాయి. చివరికి సెన్సెక్స్ 1,635 పాయింట్ల నష్టంతో 71,947 వద్ద, నిఫ్టీ 488 పాయింట్ల నష్టంతో 22,331 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Loss | అన్ని ఇండెక్స్లూ నష్టాల్లోనే..
అన్ని రంగాల ఇండెక్స్లు నష్టాల బాటలో పయనించాయి. బ్యాంక్ నిఫ్టీ 3.82 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.46 శాతం, టెలికాం 3.09 శాతం, రియాలిటీ 2.84 శాతం, మీడియా 2.50 శాతం, ఆటో 2.39 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.22 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.03 శాతం నష్టపోయాయి.
Stock Market Loss | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 876 కంపెనీలు లాభపడగా 3,563 స్టాక్స్ నష్టపోయాయి. 154 కంపెనీలు ఫ్లాట్గా ముగిశాయి. 64 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 1,546 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 9.19 లక్షల కోట్ల మేర తగ్గింది.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్లో 2 కంపెనీలు లాభాలతో, 28 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా 1.65 శాతం, పవర్గ్రిడ్ 0.15 శాతం లాభపడ్డాయి.
Top Losers : బజాజ్ ఫైనాన్స్ 5.09 శాతం, ఎస్బీఐ 3.95 శాతం, ఇండిగో 3.80 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 3.71 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.59 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Tata EV Discount | టాటా ఆఫర్.. ఈవీ కార్లపై 20 శాతం రాయితీ
