అక్షరటుడే, వెబ్డెస్క్ : Stock Market Rally | అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం ఎడతెగకుండా కొనసాగుతున్నా.. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు కాస్త శాంతించాయి. హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా టర్కీ మీదుగా చమురు ఎగుమతులను పున:ప్రారంభించేందుకు గల్ఫ్ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయన్న సమాచారంతో గ్లోబల్ మార్కెట్లు ఉపశమనం పొందాయి.
దీని ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సైతం లాభాల బాటలో పయనించాయి. దలాల్ స్ట్రీట్లో బుల్స్ జోష్ కొనసాగించినా.. కిందపడేసేందుకు బేర్స్ సైతం తీవ్రంగా ప్రయత్నించడంతో సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.
Stock Market Rally | రోజంతా లాభాల్లోనే..
దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా లాభాల బాటలోనే పయనించింది. బుధవారం ఉదయం సెన్సెక్స్ 297 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 242 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్తో ఒత్తిడికి గురై అక్కడినుంచి 422 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 122 పాయిట్లు పైకి ఎగబాకింది. గరిష్టాలనుంచి 136 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు మద్దతుగా నిలవడంతో సూచీలు భారీగా పెరిగాయి. చివరి గంటలో ప్రాఫిట్ బుకింగ్తో కొంత తగ్గాయి. చివరికి సెన్సెక్స్ 633 పాయింట్ల లాభంతో 76,704 వద్ద, నిఫ్టీ 196 పాయింట్ల లాభంతో 23,777 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Rally | ఎఫ్ఎంసీజీ, మెటల్ సెక్టార్లు మినహా..
మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి. చాలా రోజుల తర్వాత ఐటీ ఇండెక్స్ ఈరోజు జోరుమీద కనిపించింది. నిఫ్టీ (Nifty) ఐటీ ఇండెక్స్ 2.78 శాతం లాభపడగా.. మీడియా ఇండెక్స్ 3.35 శాతం, రియాలిటీ 2.75 శాతం, టెలికాం 2.44 శాతం, ఆటో 1.92 శాతం, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్లు ఒక శాతానికిపైగా లాభాలతో ముగిశాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.10 శాతం, ఎఫ్ఎంసీజీ 0.05 శాతం నష్టపోయాయి.
Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 3,202 కంపెనీలు లాభపడగా 1,088 స్టాక్స్ నష్టపోయాయి. 142 కంపెనీలు ఫ్లాట్గా ముగిశాయి. 56 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 220 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్ సర్క్యూట్ను, 13 కంపెనీలు లోయర్ సర్క్యూట్ను తాకాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 6 లక్షల కోట్ల మేర పెరిగింది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్లో 24 కంపెనీలు లాభాలతో, 6 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్ 3.37 శాతం, టెక్ మహీంద్రా 3.27 శాతం, ఇన్ఫోసిస్ 2.84 శాతం, ఎంఅండ్ ఎం 2.68 శాతం, హెచ్సీఎల్ టెక్ 2.62 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఎన్టీపీసీ 1.29 శాతం, హెచ్యూఎల్ 1.04 శాతం, సన్ఫార్మా 0.87 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.34 శాతం, ఐటీసీ 0.30 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Gold Rates India | మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..!

