అక్షరటుడే, వెబ్డెస్క్ : Stock Market Relief Rally | అమెరికా, ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో భారీ నష్టాల బాటలో పయనిస్తున్న స్టాక్ మార్కెట్లు (Stock Markets).. గురువారం కోలుకున్నాయి. అయితే యుద్ధ భయాలు వీడకపోవడంతో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.
గురువారం ఉదయం సెన్సెక్స్ 414 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 150 పాయింట్లు ఎగబాకింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్తో 463 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 57 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 142 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 483 పాయింట్ల లాభంతో 79,599 వద్ద, నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో 24,641 వద్ద కదలాడుతున్నాయి.
Stock Market Relief Rally | మెటల్ షేర్లలో కొనసాగుతున్న ర్యాలీ..
నిఫ్టీ (Nifty) మెటల్ ఇండెక్స్ 3.18 శాతం, ఎనర్జీ 2.10 శాతం, యుటిలిటీ 1.92 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.81 శాతం, పవర్ 1.71 శాతం పెరగ్గా.. క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, రియాలిటీ ఇండెక్స్లు ఒక శాతానికిపైగా లాభంతో కొనసాగుతున్నాయి. ఐటీ ఇండెక్స్ 1.34 శాతం, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.46 శాతం నష్టాలతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్లో 18 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 12 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బీఈఎల్ 2.99 శాతం, ఎన్టీపీసీ 2.80 శాతం, రిలయన్స్ 2.76 శాతం, టాటా స్టీల్ 2.67 శాతం, ఎల్టీ 2.18 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎటర్నల్ 2.41 శాతం, హెచ్సీఎల్ టెక్ 2.02 శాతం, టెక్ మహీంద్రా 1.56 శాతం, టీసీఎస్ 1.33 శాతం, ఆసియన్ పెయింట్ 1.20 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Fall | స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. రూ. 9 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు

