అక్షరటుడే, కామారెడ్డి : T20 World Cup 2026 | అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
T20 World Cup 2026 | సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో
ఫైనల్ పోరులో కివీస్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. లక్ష్య ఛేదనలో 256 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ (New Zealand) జట్టు 19 ఓవర్లలోనే 159 పరుగులకు కుప్పకూలింది. ఈ విజయంతో భారత జట్టు మరోసారి ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించింది. ఫైనల్ విజయం తర్వాత స్టేడియం మొత్తం సంబరాలతో మార్మోగిపోయింది.
T20 World Cup 2026 | వరుసగా రెండోసారి టైటిల్
ఈ విజయంతో టీమిండియా (Team India) వరుసగా రెండుసార్లు టీ20 వరల్డ్కప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఛాంపియన్గా నిలిచిన భారత్, ఇప్పుడు 2026లో కూడా టైటిల్ సాధించి ఈ అరుదైన ఘనతను అందుకుంది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా రెండు టీ20 ప్రపంచకప్ టైటిళ్లు గెలవలేదు. వెస్టిండీస్ (2012, 2016), ఇంగ్లాండ్ (2010, 2022) జట్లు చెరో రెండుసార్లు గెలిచినా వరుస విజయాలు సాధించలేకపోయాయి. భారత జట్టుకు ఇది మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్. దీంతో ఈ ఫార్మాట్లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. 2007లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో తొలి టీ20 వరల్డ్కప్ను భారత్ గెలుచుకుంది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు సెమీఫైనల్ దశలోనే ఆగిపోయింది. అయితే 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో మరోసారి కప్పు గెలిచిన టీమిండియా, ఇప్పుడు 2026లో మూడోసారి విజేతగా నిలిచింది.
T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ చరిత్రలో
మొదటి టైటిల్ (2007) తర్వాత రెండో టైటిల్ (2024) కోసం భారత్కు 17 సంవత్సరాలు పట్టింది. అయితే మూడోసారి టైటిల్ గెలవడానికి మాత్రం అంత కాలం పట్టలేదు. రెండేళ్లలోపే మరోసారి టీ20 కప్పును కైవసం చేసుకుంది. దీంతో 2007, 2024, 2026 ఎడిషన్లలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు మరే జట్టు కూడా మూడు టీ20 వరల్డ్కప్ టైటిళ్లు గెలవలేదు. ఈ విజయంతో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కూడా అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో సొంత గడ్డపై ట్రోఫీ గెలిచిన తొలి కెప్టెన్గా ఆయన నిలిచాడు. గతంలో ఏ కెప్టెన్ కూడా తమ దేశంలో జరిగిన టీ20 వరల్డ్కప్ను గెలవలేకపోయారు. ఇక గౌతమ్ గంభీర్ కూడా అరుదైన ఘనత సాధించాడు. గంభీర్ నేతృత్వంలో రెండు ఐసీసీ టైటిల్స్ టీమిండియా సాధించింది. కాగా, భారత్ గతంలో 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీలో, అలాగే 2024లో బర్బాడోస్ వేదికగా జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి..: India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్లో టాస్ అత్యంత కీలకం..

