అక్షరటుడే, వెబ్డెస్క్: T20 World Cup Final | ఎంతో ఉత్కంఠగా సాగుతున్న టీ 20 ప్రపంచ కప్ (world cup final) తుది పోరుకు సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది.
కివీస్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. తాము ముందుగా బౌలింగ్ చేయబోతున్నట్లు తెలిపాడు. ‘‘చాలా బాగుంది. భారత్ను మేము ఛేదించే స్కోరుకే పరిమితం చేయడానికి ప్రయత్నిస్తాము. సెమీఫైనల్లో మా ఆటగాళ్లు బాగా ఆడారు. ఇది అతిపెద్ద దశ. అందరూ సిద్ధంగా ఉన్నారు” అని పేర్కొన్నారు.
T20 World Cup Final | టాస్ కీలకం
ఈ టోర్నమెంట్లో భారత్ రెండు సార్లు మాత్రమే టాస్ గెలిచింది. అయితే టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియా ఒక్క మ్యాచ్లోనే ఓడిపోయింది. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ నెమ్మదిగా ఉండడం వల్ల తొలి ఇన్నింగ్స్లో బ్యాటర్లు రన్స్ సాధించడం చాలా కష్టమనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో టాస్ అనేది కీలకంగా మారింది. దీంతో టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ భారత బ్యాటర్లు ఎలా ఆడుతారో చూడాలి.
T20 World Cup Final | ఎలాంటి మార్పులు లేకుండా..
భారత్ సెమీ ఫైనల్ ఆడిన జట్టు ఎలాంటి మార్పులు లేకుండా ఫైనల్లో బరిలోకి దిగింది. వరల్డ్ కప్లో విఫలం అవుతున్న అభిషేక్ శర్మకు ఫైనల్లో మరోసారి అవకాశం దక్కింది. భారత జట్టు.. అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

