అక్షరటుడే, వెబ్డెస్క్ : Teachers Caught by ACB | విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాల్సిన గురువులే అడ్డదారి తొక్కారు. ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో చోటు చేసుకుంది.
గూడురు మండలం అయోధ్యపురం ఉన్నత పాఠశాల హెచ్ఎం రవికుమార్ ఎంఈవో (MEO)గా కొనసాగుతున్నారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ (SA) జి చంద్రమౌలి ఇన్చార్జి క్లర్క్గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరిని ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ విశ్రాంత ఉపాధ్యాయుడికి సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పదవీ విరమణ ప్రయోజన బిల్లులను తయారు చేసి, వాటిని ఏజీఏ కార్యాలయానికి పంపినందుకు వీళ్లు లంచం డిమాండ్ చేశారు.
Teachers Caught by ACB | పాఠశాలలో లంచం..
హెచ్ఎం లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి గూడూరు జెడ్పీహెచ్ఎస్ (ZPHS) ప్రాంగణంలో రూ.15 వేల లంచం తీసుకుంటుండగా వరంగల్ యూనిట్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు.. పాఠశాలలోనే లంచం తీసుకుంటూ దొరకడం గమనార్హం.
Teachers Caught by ACB | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం కోసం ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని కోరారు. ఏసీబీ తెలంగాణను వాట్సాప్ (9440446106), వెబ్సైట్ (ACB Website) ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
ఇది కూడా చదవండి : Hyderabad Road Accident | బైక్ను ఢీకొన్న కారు.. ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి
