అక్షరటుడే, కామారెడ్డి: Teachers Pay Delay | పదోతరగతి మూల్యాంకనం చేసి ఏడాది పూర్తయిందని, కులగణన (caste census payments) చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా పారితోషికం ఇంకా ఇవ్వకపోవడం (government dues) సరికాదని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలోని (Kamamreddy) పదోతరగతి స్పాట్ కేంద్రం వద్ద (SSC spot valuation) ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భోజన విరామం సమయంలో నిరసన (teachers protest) తెలిపారు.
Teachers Pay Delay | 2025లో మార్చిలో నిర్వహించిన పదో తరగతి..
ఈ సందర్భంగా టీటీజేఏసీ (TTJAC) జిల్లా ఛైర్మన్ అల్లాపూర్ కుశాల్, యూఏస్పీసీ జిల్లా ఛైర్మన్ ఆకుల బాబు, జాక్టో జిల్లా ఛైర్మన్ సయ్యద్ ఖలీముద్దీన్ మాట్లాడుతూ.. 2025 మార్చిలో నిర్వహించిన పదోతరగతి స్పాట్ మూల్యాంకనం విధుల పారితోషికం సుమారు రూ.20 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 50వేల మంది సిబ్బందితో కులగణన నిర్వహించి 18 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం పారితోషికం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కులగనణ సర్వేలో ఎన్యుమరేటర్కు రూ.10వేలు, సూపర్వైజర్కు రూ.12వేల చొప్పున మొత్తం సుమారు రూ.50 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని చెప్పారు.
Teachers Pay Delay | జనగణన చేసి 18 నెలలు గడుస్తున్నా..
జనగణన పూర్తి చేసి 18 నెలలు గడుస్తున్నా పారితోషికాన్ని చెల్లించకపోవడం బాధాకరమని, ఇది ఉద్యోగులపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పదోతరగతి మూల్యాంకన విధులకు చెల్లించే పారితోషికం గతేడాది పెంచలేదని, ఇంటర్ స్పాట్ రేట్లు రెండుసార్లు పెంచారని గుర్తుచేశారు. పదోతరగతి స్పాట్ రేట్లు కనీసం 50శాతం పెంచాలని, ఈ ఏడాది మూల్యాంకనం పూర్తి కాగానే స్పాట్ విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికే చెల్లించగా మిగిలిన అన్ని జిల్లాల్లో 2025 మార్చి ఎస్సెస్సీ స్పాట్ మూల్యాంకన పారితోషికాన్ని, కులగణన పారితోషికాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బషీర్, ఎస్టీయూటీఎస్ జిల్లా నాయకులు పంపరి ప్రవీణ్ కుమార్, డీటీఎఫ్ ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు యాదయ్య, ఇతర సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
