అక్షరటుడే, హైదరాబాద్: Telangana Assembly Clash | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పసారా తయారీ అంశంపై ఆర్మూర్ భాజపా ఎమ్మెల్యే Rakesh Reddy చేసిన వ్యాఖ్యలు అధికార పక్షాన్ని ఆగ్రహానికి గురిచేశాయి. ముఖ్యంగా, ఇప్పసారా తయారీ కోసం ‘ఇందిరమ్మ’ పేరు ఉపయోగించొద్దని రాకేష్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
Telangana Assembly Clash | మంత్రుల స్పందన..
ఈ వ్యాఖ్యలపై మంత్రి Ponnam Prabhakar ఘాటుగా స్పందించారు. చారిత్రక నేతల పేర్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని అన్నారు. రాకేష్రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాకేష్ వ్యాఖ్యలపై మంత్రి Sridhara Babu, మంత్రి Vakiti Srihari సైతం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
Telangana Assembly Clash | మాటల యుద్ధం..
ఇదే క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్కు సభను నియంత్రించడం కష్టంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి శాంతించాలని సభ్యులను స్పీకర్ కోరారు.
ఇదిలా ఉండగా, తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని ప్రతిపక్షం వాదించింది. ప్రభుత్వం విమర్శలను సహించలేకపోతుందని ప్రతిపక్షం ఆరోపించింది. కాగా, బాధ్యతాయుత పదవిలో ఉన్న ఎమ్మెల్యేలు మాటల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అధికార పక్షం సభ్యులు సూచించారు.

