అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Assembly Elections | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) 2029లో వస్తాయని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో 2023 నవంబర్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ లెక్కన 2028 నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు జరగాలి. సీఎం (CM Revanth Reddy) మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ ఎన్నికలు 2028 డిసెంబర్లో ఉండాలని, కానీ మరో నాలుగు, ఐదు నెలలు ఆలస్యంగా డిసెంబర్లో వస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోందని ఆయన పేర్కొన్నారు. దీంతో 2029లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సైతం పార్లమెంట్ ఎన్నికలతో పాటు 2029లో జరిగే అవకాశం ఉందన్నారు.
Telangana Assembly Elections | సాధ్యమేనా..
ఒకే దేశం – ఒకే ఎన్నికలు అనే విధానాన్ని తీసుకు రావాలని కేంద్రంలోని బీజేపీ (BJP) యోచిస్తోంది. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే పలు ప్రాంతీయ పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రానికి ఒక్కోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ప్రజాధనం వృథా కావడంతో పాటు అభివృద్ధి పనుల్లో జాప్యం నెలకొంటుందని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పట్లో జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Telangana Assembly Elections | గతంలో పార్లమెంట్తో పాటే..
ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు (Parliamentary Elections) ఒకేసారి జరిగేవి. తెలంగాణ ఏర్పడిన తొలి ఎన్నికలు సైతం పార్లమెంట్ ఎన్నికలతో పాటే నిర్వహించారు. అయితే 2018లో అప్పటి సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆరు నెలల ముందుగానే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో జరుగుతుండగా.. పార్లమెంట్ ఎలక్షన్లు ఏప్రిల్, మే నెలల్లో జరుగుతున్నాయి. ఏపీలో మాత్రం రెండు ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన.. రెండో విడతలో వారికి అవకాశం

