అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Budget Session | తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Sessions) ప్రారంభం అయ్యాయి. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన గవర్నర్గా వచ్చిన తర్వాత తొలిసారి సభకు వచ్చారు. సమావేశాల్లో గవర్నర్ మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) పురోగతిలో ప్రతిపౌరుడు భాగస్వామి అన్నారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగుతోందని తెలిపారు.
ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ మారుతుందని గవర్నర్ పేర్కొన్నారు. 2047 తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. అందరి సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. హైదరాబాద్ (Hyderabad) నగర అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Telangana Budget Session | హిల్ట్ పాలసీతో..
తెలంగాణను సైతం కోర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా వర్గీకరించినట్లు తెలిపారు. హిల్ట్ పాలసీతో పరిశ్రమలకు భూములు బదలాయిస్తామన్నారు. అలాగే మూసీ సుందరీకరణ చేపడుతామన్నారు. మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. మూసీ నదిలో మురుగు నీరు చేరకుండా 39 ఎస్టీపీలు నిర్మిస్తామన్నారు.
Telangana Budget Session | తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పునరుద్ధరించిన మండలి భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Rain Alert | నేడు రాష్ట్రానికి వర్ష సూచన

