అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Heat Wave| రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. ఇటీవల అల్పపీడనంతో తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. పగటి పూట వేడి అధికంగా ఉంటుంది. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.
మార్చిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదు అవుతాయని అధికారులు హెచ్చరించారు. సోమవారం నుంచి భానుడు తన ప్రతాపం చూపుతాడని పేర్కొన్నారు. ముఖ్యంగా మార్చి 3 నుంచి 7 వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా (Asifabad District)ల్లో ఉష్ణోగ్రతలు 39-41 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో 36 నుంచి 37 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. మిగతా జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల వరకు ఉండనుంది.
Telangana Heat Wave | అప్రమత్తంగా ఉండాలి

ఎండలు మండుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వేసవి ప్రారంభంలోనే భానుడు భగభగ మండుతుండటంతో రాను రాను పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా పగటి పూట బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగాలని, మధ్యాహ్నం వేళ ఎక్కువగా బయట తిరుగొద్దని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో కుటుంబ సభ్యులు జాగ్రత్తలు వహించాలని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Telangana Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్

