అక్షరటుడే, ఇందూరు: Telangana Housing Board Auction | తెలంగాణ హౌసింగ్ బోర్డు నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో నివాస ప్లాట్లు, ఇళ్లకు వేలం విజయవంతంగా ముగిసింది. నగరంలోని కంఠేశ్వర్ ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Telangana Housing Board Auction | 44 మంది బిడ్డర్లు..
వేలంలో ప్రజలను నుంచి స్పందన లభించింది. 44 బిడ్డర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 19 ఆస్తులు వేలానికి ప్రకటించగా.. అందులో 12 ఆస్తులు విజయవంతంగా అమ్ముడయ్యాయి. మరో ఏడు ఆస్తులు అమ్ముడు పోలేదు.
వేలం వివరాలివి..
మొత్తంగా11 ఓపెన్ ప్లాట్లు అమ్ముడయ్యాయి. ఒక ఇల్లును హౌసిండ్ బోర్డు అధికారులు విక్రయించారు. ఈ వేలం ద్వారా తెలంగాణ హౌసిండ్ బోర్డుకు రూ.6,56,51,381 ఆదాయం లభించింది. ఈ వేలంలో చదరపు గజం రూ.24,000 పలికింది. ఆ ధర అధికారులు నిర్ణయించిన రూ.15,000 కంటే చాలా ఎక్కువగా ఉండటం విశేషం. ఈ వేలాన్ని బిడ్డర్ల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

