అక్షరటుడే, నిజామాబాద్సిటీ: Telangana minorities issue | మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం మొండిచేయి (minorities welfare) చూపించిందని బీఆర్ఎస్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం మైనారిటీ (BRS party) నాయకుడు నవీబ్ ఇక్బాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
Telangana minorities issue | మైనారిటీలను మోసం చేశారు..
ఈ సందర్భంగా నవీబ్ ఇక్బాల్ మాట్లాడుతూ (budget allocation) కేసీఆర్ ప్రభుత్వంలో మైనారిటీలకు (Telangana politics) పెద్దపీట వేశామన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం(Nizamabad news) వచ్చిన తర్వాత మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారన్నారు. బడ్జెట్లో మైనారిటీలకు రూ.4వేల కోట్లు నిధులు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని ఆయన దుయ్యబడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి తోఫాలు అందించడం జరిగిందని.. ప్రస్తుతం అరకొర నిధులతో తోఫాలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కహామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు.
ఒక పథకం కూడా పూర్తిగా అమలు చేయకుండా నిధులను వృథా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Telangana news) ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ షెహజాద్, మహ్మద్ మతిన్, అబ్దుల్ బారీ, సనా ఉల్లాఖాన్, మహ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ సమి, అబ్దుల్ అజీజ్, మజర్ ఉద్దీన్, తజ్జముల్ ఖాన్, మహ్మద్ హఫీజ్, నయీబ్ ఖురేషి, మహ్మద్ ఇమ్త్యాజ్, యూనిస్, మహ్మద్ ఆరిఫ్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి..

