అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana New Governor | తెలంగాణ గవర్నర్గా నియమితులైన శివప్రతాప్ శుక్లా కుటుంబంతో సహా మంగళవారం హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఘన స్వాగతం పలికారు.
కేంద్రం ప్రభుత్వం ఇటీవల పలు రాష్ట్రాల గవర్నర్లను మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ గవర్నర్గా పని చేస్తున్న జిష్ణుదేవ్వర్మను మహారాష్ట్రకు పంపించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla)ను తెలంగాణకు నియమించింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. నూతన గవర్నర్కు సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి (DGP Shivdhar Reddy) స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనతో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Telangana New Governor | రేపు ప్రమాణస్వీకారం
కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు లోక్ భవన్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)కు చెందిన శుక్లా గతంలో బీజేపీలో కీలకంగా పని చేశారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రమంత్రిగా పని చేశారు. 2017 నుంచి 2019 వరకు మోదీ మంత్రివర్గంలో పని చేశారు. అనంతరం ఆయన 2023 ఫిబ్రవరి 18న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. తాజాగా తెలంగాణ గవర్నర్గా వచ్చారు.
ఇది కూడా చదవండి..: Kavitha Siddipet Contest | సిద్ధిపేట నుంచి కల్వకుంట్ల కవిత పోటీకి దిగనుందా.. నెట్టింట వైరల్!

