అక్షరటుడే, హైదరాబాద్: Telangana Rajya Sabha Candidates | తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్ మను సింఘ్వితోపాటు వేం నరేందర్ రెడ్డి పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది.
రాజ్యసభ అభ్యర్థులు ఖరారైన వీరు గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మాజీ ఎంపీ హెచ్, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వినయ్ కుమార్, కుసుమ కుమార్ తదితరుల పేర్లు మొదట వినిపించినప్పటికీ.. చివరికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు.
Telangana Rajya Sabha Candidates | ఒకేసారి ఇద్దరు పార్టీ తీర్థం
వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాకు చెందినవారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి తెలుగు దేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో జరిగిన హనుమకొండ నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చెందారు. అనంతరం రేవంత్ రెడ్డితోపాటు వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు.

