అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Rajya Sabha Election | తెలంగాణ (Telangana) నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభకు ఎన్నికయ్యారు.
రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ సింఘ్వీ (Abhishek Singhvi), బీఆర్ఎస్ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Telangana Rajya Sabha Election | నేడు అధికారిక ప్రకటన
సంఖ్యా బలం లేకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ రెండు స్థానాల్లో ఏకగ్రీవంగా గెలుచుకుంది. అభిషేక్ సింఘ్వీకి మరోసారి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ మరోస్థానానికి సీఎం ముఖ్య కార్యదర్శిగా పని చేసిన వేం నరేందర్రెడ్డి (Vem Narender Reddy)ని ఎంపిక చేసింది. ఇటీవల ఇద్దరు నామినేషన్లు సైతం వేశారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు విత్ డ్రాకు గడువు ఉంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు వారి ఎన్నికపై అధికారిక ప్రకటన రానుంది.
ఇది కూడా చదవండి..: Krishna River Water | చుక్క నీరు కూడా వదులుకోం : మంత్రి ఉత్తమ్

