అక్షరటుడే, బాన్సువాడ: Telangana Rajyadhikara Party | తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు జరిగాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(teenmar mallanna) సమక్షంలో రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి ఆకుల హన్మాండ్లు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాహిర్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
Telangana Rajyadhikara Party | కామారెడ్డి, బాన్సువాడ నుంచి..
ఈ సందర్భంగా కామారెడ్డి (kamareddy district politics) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా సబ్బిడి రమేష్ను, బాన్సువాడ నియోజకవర్గ (banswada political news) ఇన్ఛార్జీగా గాండ్ల సుధీర్ కుమార్ను, బోర్లం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గాండ్ల అశోక్ను నియమించి వారికి నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జి గాండ్ల సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పాలన అందిస్తామని పేర్కొన్నారు. బీసీ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్న ఈ పార్టీని స్థాపించినట్లు ఆయన పేర్కొన్నారు.
Telangana Rajyadhikara Party | యువతకు అధిక ప్రాధాన్యత..
పార్టీ కార్యవర్గంలో త్వరలోనే యువతకు కూడా అధిక ప్రాధాన్యత (party joinings telangana,) కల్పిస్తామని మల్లన్న తెలిపారు. బీసీల అభ్యున్నతికే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పడిందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని చెప్పారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు తీన్మార్ మల్లన్నకు ఈ సందర్భంగా సుధీర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డోంగ్లి శ్రీనివాస్, కళ్లెం రాజు, రైతు విభాగం అధ్యక్షుడు సింగారపు సిద్దయ్య, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు బాలరాజ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Indiramma Houses Scheme | పథకాలను పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

