అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Road Safety Cess | తెలంగాణలోని వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను విధించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారుల ధరలు పెరగనున్నాయి.
Telangana Road Safety Cess | మార్చి 1 నుంచి అమలు..
కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను విధిస్తూ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త వాహనాలపై ‘రోడ్ సేఫ్టీ సెస్’ పేరిట రూ.2,000 నుంచి రూ.10,000 వరకు వసూలు చేయనుంది. మార్చి 1వ తేది నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ఈ పన్నుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
Telangana Road Safety Cess | వాహనం ఆధారంగా పన్ను
మార్చి 1 నుంచి కొనుగోలు చేసే వాహనాలపై పన్ను వసూలు చేసే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై రూ.2,000 నుంచి రూ. 10,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలైతే రూ.2 వేలు, లైట్ మోటార్ వెహికిల్స్కు రూ.5 వేలు, ఇతర వాహనాలకు రూ.10 వేల చొప్పున పన్ను వేయనున్నారు. కాగా.. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే సెస్ను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి..: iQOO 15R Launch | ఐకూనుంచి మిడ్రేంజ్లో పవర్ఫుల్ ఫోన్..! ప్రీ బుకింగ్తో ఐకూ టీడబ్ల్యూఎస్ ఫ్రీ..

