అక్షరటుడే, ఇందూరు: Telangana Telugu Dialects | మాండలిక వికాసమే భాషాభివృద్ధికి (Telugu Language Development) మూలం అని పలువురు ప్రముఖ సాహితీవేత్తలు పేర్కొన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో(Giriraj Government Degree College) కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ‘వికాసం వికృతి, వైవిధ్యం’ అనే అంశంపై ఒకరోజు (Linguistics Seminar) జాతీయ సదస్సు నిర్వహించారు.
Telangana Telugu Dialects | తెలుగు భాష మూలాలు..
ప్రారంభ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆచార్యులు బాణాల భుజంగ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాష మూలాలు తెలంగాణ (Telangana Culture) మాండలికంలోనే దాగి ఉన్నాయని పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ పరిశోధకులు సంగనభట్ల నర్సయ్య ప్రసంగిస్తూ.. తెలంగాణ భాషా పరిరక్షణకు ప్రత్యేకంగా నిఘంటువును రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన కొన్ని మాండలిక పదాలు ఆహుతులను అలరించాయి.
Telangana Telugu Dialects | విద్యార్థుల వికాసానికి..
కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల వికాసానికి ఎంతో దోహదం చేస్తాయన్నారు. సదస్సు కన్వీనర్ లెఫ్ట్నెంట్ డాక్టర్ రామస్వామి మాట్లాడుతూ.. తెలుగు మాండలిక సాహిత్యం గొప్పతనాన్ని దాని పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియజేయడానికి ఒకరోజు జాతీయ సదస్సు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ జాతీయ సదస్సును అంతర్జాలం, వేదిక పైన రెండు వేదికలపై నిర్వహించడం, మన రాష్ట్రం నుంచి కాకుండా తమిళనాడు, చెన్నై, ఢిల్లీ, ఒడిశా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర విశ్వవిద్యాలయం నుంచి పరిశోధకులు రావడం అభినందనీయమన్నారు.
Telangana Telugu Dialects | ముగింపు సమావేశంలో..
ముగింపు సమావేశంలో ప్రముఖ సాహితీవేత్త హైదరాబాద్ సిటీ కళాశాల ఆచార్యులు డాక్టర్ కోయ కోటేశ్వరరావు కీలక ఉపన్యాసం చేశారు. యూట్యూబ్లో జానపద పాటల్లో అరుదైన సంపద (Language Research India) గ్రామీణ పదాలే అన్నారు. అస్థిత్వ ఉద్యమం వచ్చిన తర్వాతే అద్భుతమైన భాష ఉందన్నారు. గ్రామీణ ప్రజల నుంచి సేకరించిన పదాలే భాషను బతికిస్తాయన్నారు. నిఘంటువుల్లో కన్నా బయట ఉన్న భాష గొప్పదన్నారు. ప్రామాణిక తెలంగాణ తెలుగు భాషకు ప్రాణం.. అసలైన తెలుగు పదాలు తెలంగాణలోనే బతికున్నాయన్నారు. సజీవమైన భాష(Telangana Dialect Studies) తెలంగాణ మాండలికంలోనే ఉందన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం, ఐకేసీ కోఆర్డినేటర్ రాజేష్, పీఆర్వో దండు స్వామి, ఏవో రామకృష్ణ, సూపరింటెండెంట్ ఉదయ్ భాస్కర్, అధ్యాపకులు, శమంత, శ్రీనివాస్ గంగాధర్ రాజేశ్వర్, రాధిక, అర్చన తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: UPSC Results | సివిల్స్లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు

