అక్షరటుడే, బాన్సువాడ: Telangana Tirumala Brahmotsavam | బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తెలంగాణ తిరుమల దేవస్థానంలో(Telangana Tirumala temple) లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam festival) శనివారం ముగిశాయి. ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగాయి. ఆరో రోజైన శనివారం చక్రస్నానంతో ఉత్సవాలను ముగించారు.
Telangana Tirumala Brahmotsavam | చక్రస్నానం సందర్భంగా..
చక్రస్నానం (Chakrasnanam ritual) సందర్భంగా ఆలయ ధర్మకర్తలు బాన్సువాడ (Banswada) పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు(Mla Pocharam), శంభురెడ్డి దంపతులకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర స్నానం చేయించారు. అనంతరం భక్తులు కోనేరులోని తీర్థాన్ని స్వీకరించి గోవింద నామస్మరణతో స్వామివారి ఆశీస్సులు పొందారు. తిరుమలలో గరుడ పక్షి దర్శనమిచ్చినట్లు ఇక్కడ కూడా అభిషేకాల సమయంలో కొండపై గరుడ పక్షి మూడుసార్లు చక్కర్లు కొట్టడం భక్తుల్లో విశేష భక్తి భావాన్ని రేకెత్తించింది.
Telangana Tirumala Brahmotsavam | గరుడపక్షి దర్శనమివ్వగా..
గరుడ పక్షి దర్శనమిచ్చిన వెంటనే గోవిందా.. గోవిందా అంటూ భక్తులు నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. వేద పండితులు నందకిషోర్, అభిషేక్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. శనివారంతో ఈ ఏడాది శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి.

ఇది కూడా చదవండి: Paddy storage warehouses | ధాన్యం నిలువలకు గోడౌన్లను సిద్ధం చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

