అక్షరటుడే, వెబ్డెస్క్: Tirumala Laddu Controversy | ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అధికారులు, నిపుణులందరూ కలిసి కుట్రలు చేశారని ఆక్షేపించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఆయన శాసన సభలో నిర్వహించిన చర్చలో మాట్లాడారు. వైసీపీ హయాంలో లడ్డూ కల్తీ జరిగిన తీరును పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
Tirumala Laddu Controversy | సిట్ ఏర్పాటు చేయాలని సూచించిన సుప్రీం
లడ్డూ వ్యవహారంలో సీబీఐ ఆధ్వర్యంలో విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించిందని సీఎం పేర్కొన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీబీఐ రిపోర్టు పంపించిందన్నారు. అందుకే ఏకసభ్య కమిటీ వేయాలని నిర్ణయించామని తెలిపారు. లడ్డూ వ్యవహారంలోనే కాదు.. చాలా విషయాల్లో తప్పులు చేశారన్నారు. 2019-24 మధ్య 59.71లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వినియోగించారని చెప్పారు. రూ.231.51 కోట్ల అక్రమాలు జరిగాయని.. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను నీరుగార్చారని చెప్పారు. కల్తీ నెయ్యి అని నిర్ధారణ అయినా కూడా రిపోర్టును తొక్కిపెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు.
Tirumala Laddu Controversy |ఈవో, ఛైర్మన్కు తెలియకుండా జరిగాయా..!
రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధనను తొలగించాలని చంద్రబాబు పేర్కొన్నారు. నెయ్యి తయారీకి కావాల్సిన అనుభవాన్ని మూడేళ్ల నుంచి ఏడాదికి కుదించారని చెప్పారు. రోజుకు 12 టన్నులుగా ఉండాల్సిన వెన్న తయారీ ఎనిమిది టన్నులకు తగ్గించారని ముఖ్యమంత్రి తెలిపారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజిట్లకు పూర్తిగా మినహాయింపు ఇచ్చారని వెల్లడించారు. ఇన్ని జరిగితే తితిదే బోర్డు ఈవో, ఛైర్మన్కు తెలియకుండా జరుగుతాయా అని చంద్రబాబు అన్నారు. ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా నాణ్యత తగ్గిందని చెప్పారు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఇది కూడా చదవండి..: Inter Exams | రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు..

