అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Toddy Depot Permission | నగరంలో సుమారు 500 కుటుంబాలకు జీవనాధారమైన రెండో కల్లు డిపోను నడిపించుకునేలా అనుమతి ఇవ్వాలని సొసైటీ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం ఎక్సైజ్కార్యాలయం (Excise Office)లో ఎస్హెచ్వోకు వినతిపత్రం అందజేశారు.
Toddy Depot Permission | సమస్యలను పరిష్కరించుకున్నాం..
నిజామాబాద్ టీటీసీఎస్ (Nizamabad TTCS) డిపో–2లో నెలకొన్న సమస్యలు పరిష్కారించుకొన్నామని, తమ వ్యాపారం కొనసాగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా ఎస్హెచ్వోను వారు కోరారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్–2 కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘంకు సంబంధించిన కార్మికులుగా గత రెండున్నర దశాబ్దాలుగా సొసైటీ నడుపుకొంటూ 500 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయన్నారు. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ (Excise Department) సహాయ సహకారాలు మాకు ఎప్పుడు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
కానీ గత కొన్ని రోజులుగా మా వ్యాపారస్థుల మధ్య నెలకొన్న విభేదాలు మీ దృష్టికి వచ్చి సమస్య పరిష్కారం అయ్యే వరకు మూసి ఉంచాలని అదేశించడంతో తాము డిపోను మూసివేశామన్నారు. ప్రస్తుతం ఎలాటి వివాదాలు లేవని.. భవిష్యత్తులోనూ ఎలాంటి విభేదాలు లేకుండా ఉమ్మడిగా సొసైటీ నిర్వహించుకుంటామని హామీ ఇస్తున్నామన్నారు. ఎక్సైజ్ అధికారులను (Excise Officers) కలిసిన వారిలో రెండవ డిపో సొసైటీ ప్రతినిధులు, సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాగౌడ్, సరోజ, బాలా గౌడ్, పంజా గౌడ్, గౌడ కులస్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Praja Palana Development | ప్రజాపాలనలో వేగంగా అభివృద్ధి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
