అక్షరటుడే, వెబ్డెస్క్: Toll Rules Change | దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం (Central Government) కొత్త టోల్ నిబంధనలు అమలు చేయనుంది. ఏప్రిల్ 10 నుంచి ఈ నియమాలు అమల్లోకి రానున్నాయి.
టోల్ వసూళ్లను మరింత పారదర్శకంగా, వేగంగా మార్చే లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపై టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా నిలిపివేయనున్నారు. అన్ని వాహనాలు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ విధానంలోనే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ చెల్లింపులను (Digital Payments) ప్రోత్సహించే దిశగా ఈ చర్యలు తీసుకున్నారు.
Toll Rules Change | ఐడీ కార్డు మినహాయింపులకు ముగింపు
ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు, రక్షణ సిబ్బంది వంటి వారు తమ గుర్తింపు కార్డులు చూపించి టోల్ ఫీజు మినహాయింపులు పొందుతున్నారు. అయితే ఇకపై ఈ విధానానికి పూర్తిగా ముగింపు పలికారు. ప్రైవేట్ వాహనాల్లో (Private Vehicles) ప్రయాణించే సమయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. కేవలం ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించే వారికే మినహాయింపు వర్తిస్తుంది. ఈ విషయంపై సంబంధిత శాఖలకు అధికారిక సూచనలు జారీ చేశారు. టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. రహదారులపై అమర్చిన పరికరాలు వాహనాన్ని గుర్తించి స్వయంచాలకంగా టోల్ రుసుము (Toll Fee) వసూలు చేస్తాయి. దీంతో ప్రయాణం మరింత వేగవంతం కానుంది.
Toll Rules Change | టోల్ వసూళ్లలో కొత్త విధానం
వాహనంలో అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరం లేకపోతే, ప్రయాణం పూర్తయ్యాక సంబంధిత యజమానికి నోటీసు జారీ అవుతుంది. ఆ నోటీసు అందిన 15 రోజుల్లోగా టోల్ రుసుము చెల్లించాలి. టోల్ చెల్లింపులకు ఉపయోగించే వార్షిక పాస్ ధరలు కూడా ఇటీవల పెరిగాయి. గత ధరతో పోలిస్తే సుమారు 2.5 శాతం పెంపుతో ప్రస్తుతం ధర రూ.3075గా ఉంది. మొత్తానికి, టోల్ వసూళ్లలో కొత్త విధానం అమలుతో ప్రయాణం సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొత్త నియమాలు తెలియని వారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముండటంతో ముందుగానే అవగాహన కలిగి ఉండటం అవసరం.
ఇది కూడా చదవండి..: Rajnath Singh Warns Pakistan | పాకిస్తాన్కు రాజనాథ్ సింగ్ మాస్ వార్నింగ్.. ఆ దేశం ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలని వ్యాఖ్య
