అక్షరటుడే, వెబ్డెస్క్ : TPCC Chief District Tour | కాంగ్రెస్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ (Mahesh Goud) చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం దిశగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల డీసీసీ (DCC) లను ప్రకటించిన ఆయన తాజాగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమగ్రంగా చేరేలా చూడనునన్నారు.
TPCC Chief District Tour | నాయకులతో సమావేశాలు
ప్రతి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పీసీసీ చీఫ్ సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక సమస్యలు, పార్టీ పరిస్థితులపై సమీక్ష చేపడుతారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడంతో పాటు భవిష్యత్ ఎన్నికల దిశగా పటిష్ట కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.
TPCC Chief District Tour | ప్రజల్లోకి సంక్షేమ పథకాలు
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లనున్నారు. ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడం ద్వారా పార్టీపై విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లాల పర్యటనల ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని, కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని పీసీసీ చీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఆయా జిల్లాల్లో పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలపై సైతం ఆయన చర్చించే అవకాశం ఉంది.

దీనిని కూడా చదవండి : Danam Nagender | దానం నాగేందర్కు షాక్.. అనర్హతపై హైకోర్టుకు బీజేపీ

