అక్షరటుడే, కామారెడ్డి: TU South Campus | భిక్కనూరులోని సౌత్ క్యాంపస్లో (South Campus News) ఇటీవల జరిగిన ర్యాగింగ్ ఘటనపై యూనివర్సిటీ తరఫున కమిటీ వేశామని, కమిటీ నివేదిక ఆధారంగా తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని క్యాంపస్ ప్రిన్సిపాల్ డా.సుధాకర్ గౌడ్ తెలిపారు. శనివారం సౌత్ క్యాంపస్లో అధ్యాపకులతో ఆయన సమావేశం నిర్వహించారు.
TU South Campus | అన్ని అంశాలపై చర్చించాం..
ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. సౌత్ క్యాంపస్లో విద్యార్థులు ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడినా, క్రమశిక్షణ ఉల్లంఘించినా (University Discipline) కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడడం చట్టరీత్యా నేరమన్నారు. ర్యాగింగ్ విషయంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు. మరోసారి అన్ని విభాగాల విద్యార్థులకు కౌన్సెలింగ్ (Anti Ragging Committee) నిర్వహిస్తామని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
TU South Campus | నిబంధనలు పాటించాలి..
ప్రతి విద్యార్థి విశ్వవిద్యాలయ నిబంధనలకు (Telangana Education News) కట్టుబడి ఉండాలని, ఆయా విభాగాల అధ్యక్షులు విద్యార్థుల ప్రవర్త పట్ల, వారి చదువు పట్ల శ్రద్ధ (Higher Education India) తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో తరగతులకు హాజరయ్యేలా చూడాలని, క్రమ శిక్షణ పాటించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో హాస్టల్ వార్డెన్లు సునీత, యాలాద్రి, ఏపీఆర్వో సరిత, ఫిజిక్స్ హెడ్ మోహన్ బాబు, సోషల్ వర్క్ హెడ్ అంజయ్య, జియో ఇన్ఫర్మాటిక్స్ హెడ్ సబిత, అధ్యాపకులు హరిత లక్కరాజు, ప్రతిజ్ఞ, నారాయణ, నిరంజన్, వైశాలి, నర్సయ్య, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్రెడ్డి

